ఆపదలో ఉన్న దోస్తుకు ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న  దోస్తుకు ఆర్థిక సహాయం

నవాబుపేట,వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమై ఉన్న మిత్రుడిని  చిన్ననాటి దోస్తులు ఆదుకున్నారు. మండలంలోని కారూరు గ్రామానికి చెందిన నర్సింహులు  గత వారం మైసమ్మ అలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయాడు. 

కుటుంబాన్ని పోషించే వ్యక్తి మంచం పట్టడంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న  ఇప్పటూరు హైస్కూల్​1998 పదో తరగతి  బ్యాచ్ కు చెందిన  20 మంది  దోస్తులు హాస్పిటల్ లో  నర్సిములును పరామర్శించి  రూ. 53 వేలను కుటుంబసభ్యులకు  అందజేసి తమ స్నేహబంధాన్ని చాటిచెప్పారు.