చేవెళ్ల, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానర్చకులు, ఆలయ మేనేజింగ్ డైరెక్టర్ సౌందర్ రాజన్ కు భక్తజనులు తుది వీడ్కోలు పలికారు. వృద్దాప్య సమస్యలతో శుక్రవారం సాయంత్రం ఆయన మృతిచెందగా, కుటుంబ సభ్యులు శనివారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేశ్ రెడ్డి, కొంపల్లి అనంత్రెడ్డి, మొయినాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ గరుగు రాజు ముదిరాజ్, మాజీ సర్పంచ్ నరోత్తం రెడ్డి, వేలాది మంది భక్తులు అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు
