పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చైనా అండ!..3.4 బిలియన్ల డాలర్ల వాణిజ్య రుణం

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు చైనా అండ!..3.4 బిలియన్ల డాలర్ల వాణిజ్య రుణం

పాకిస్తాన్​కు చైనా ఆర్థిక మద్దతు కొనసాగిస్తోంది. తాజాగా 3.4బిలియన్​ డాలర్ల వాణిజ్య రుణం ఇచ్చేందుకు చైనా అంగీకరించింది.ఇది పాకిస్తాన్​ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా ఆ దేశ విదేశీ మారక నిల్వలను పెంచేందుకు చాలా కీలమైన రుణం. దీంతోపాటు పాకిస్తాన్​ మిడిల్​ఈస్ట్​ వాణిజ్య బ్యాంకుల నుంచి 1బిలియన్​ డాలర్లు, మల్టీ ఫైనాన్సింగ్​నుంచి 500మిలియన్​ డాలర్లు పొందింది. ఈ మొత్తం నిధులు పాకిస్తాన్​ విదేశీ మారక నిల్వలను 14 బిలియన్ డాలర్లు పెంచుతాయి. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సర IMF లక్ష్యానికి సమానం. 

ALSO READ | US Visa: పాకిస్థానీలకు యూఎస్ వీసా కష్టమే.. రూల్స్ కఠినం చేసిన ట్రంప్

గత మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ నిల్వల్లో ఉన్న 2.1 బిలియన్ల డాలర్లను బీజింగ్ వెనక్కి తీసుకుంది. పాక్​ రెండు నెలల క్రితం తిరిగి చెల్లించిన మరో 1.3 బిలియన్ల డాలర్ల వాణిజ్య రుణాన్ని తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్​ ప్రస్తుతం 7 బిలియన్​ డాలర్ల IMF బెయిలౌట్​ ప్యాకేజీతో పాక్​ ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతుందని తెలుస్తోంది. పాకిస్తాన్​కు చైనా ఇస్తున్న రుణాలు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ముఖ్యంగా విదేశీ మారక నిల్వలను పెంచడం ద్వారా  పాకిస్తాన్​ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు. 

చైనా, పాకిస్తాన్​ ల మధ్య ఆర్థిక సంబంధాలు మొదటి నుంచి బలంగానే ఉన్నాయి. ఈ రుణాలు పాకిస్తాన్​ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది పాకిస్తాన్​ కు కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఈ రుణాలను పాకిస్తాన్​ లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించనున్నారు. 

చైనా-పాకిస్తాన్ ఆర్థిక సంబంధాలు వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి మరియు రెండు దేశాల భవిష్యత్తు అభివృద్ధిలో CPEC ఒక కీలక పాత్ర పోషిస్తుంది. 
చైనా, పాకిస్తాన్ మధ్య ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి, ముఖ్యంగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ద్వారా ఇవి మరింత బలపడ్డాయి. CPEC చైనా "బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) లో ఒక కీలక భాగం.

CPEC పాకిస్తాన్​ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ప్రాజెక్టు 

CPEC పాకిస్తాన్ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ప్రాజెక్టు. మొదట  46 బిలియన్​ డాలర్లకు అంచనా వేయబడిన ప్రాజెక్టు..2020 నాటికి 62 బిలియన్లకు చేరుకుంది.2022 నాటికి చైనా పెట్టుబడులు 65 బిలియన్లకు పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. 
CPEC ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా ఇంధనం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో రోడ్లు, రైల్వేలు, పైప్‌లైన్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, గోదర్ పోర్టు అభివృద్ధి వంటివి ఉన్నాయి.

గోదర్ పోర్టు: చైనా గోదర్ పోర్టుపై నియంత్రణ సాధించింది. ఈ పోర్టు చైనాకు పర్షియన్ గల్ఫ్ నుండి గ్లోబల్ ఎగుమతి దిగుమతులకు సాయపడుతుంది. ఇది మలక్కా జలసంధిపై చైనా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.

CPEC కింద ఇంధన రంగంలో చైనా పెట్టుబడులు పాకిస్తాన్ విద్యుత్ కొరతను తగ్గించడంలో సాయపడుతున్నాయి. 2017 డిసెంబరులో పాకిస్తాన్ మిగులు విద్యుత్ ఉత్పత్తిని సాధించింది.

CPEC ద్వారా పాకిస్తాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించారు. లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు.చైనా, పాకిస్తాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటి. 2017లో ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం 20 బిలియన్లు డాలర్లను దాటింది. చైనా నుండి పాకిస్తాన్‌కు ఎగుమతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.