కేసీఆర్​కు చిన్నజీయర్​ పరామర్శ

కేసీఆర్​కు చిన్నజీయర్​ పరామర్శ

హైదరాబాద్, వెలుగు : తుంటి ఎముక విరగడంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ​చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను శనివారం రాత్రి చిన్నజీయర్​ స్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాదాపుగా రెండేళ్లుగా చిన్న జీయర్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. తాజాగా కేసీఆర్ ​ఫామ్‌ హౌస్​లో కిందపడి హాస్పిటల్​లో చేరడంతో జీయర్ ​స్వయంగా హాస్పిటల్​కు వచ్చి  పరామర్శించారు.