కాగ జ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి తహసీల్దార్గా పనిచేస్తున్న దామెర వెంకటేశ్వర్ రావుకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు సీసీఎల్ఏ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్ని నెలల క్రితమే ఆయన చింతల మానేపల్లి మండలానికి బదిలీపై వచ్చారు. డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందడంతో తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది, మండలంలోని వివిధ శాఖల అధికారులు వెంకటేశ్వర్రావుకు అభినందనలు తెలిపారు.
