న్యూఢిల్లీ: చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ సెమికండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ను గుజరాత్లో ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ ఏర్పాటుకు రూ. 22,540 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడిలో రూ. 6,760 కోట్లను తాము పెడుతుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం రెండు దశలలో సమకూరుస్తుందని మైక్రాన్ తెలిపింది. లోకల్ సెమికండక్టర్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు ఇండియా తీసుకుంటున్న చొరవ మంచి పరిణామమని మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా చెప్పారు.
మాడిఫైడ్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) స్కీము కింద ప్రభుత్వం ఈ మైక్రాన్ ప్లాంట్కు అనుమతి ఇచ్చింది. స్కీము కింద ప్రాజెక్టు ఖర్చులో 50 శాతాన్ని ఫిస్కల్ సపోర్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మైక్రాన్ పొందుతుంది. ఇది కాకుండా మరో 20 శాతాన్ని ఇన్సెంటివ్స్ రూపంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. 2023 లోనే ప్లాంట్నిర్మాణం మొదలవనుంది. మొదట 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తారు. ఇది 2024 చివరలోపు ఆపరేషన్స్ ప్రారంభించనుంది.