చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్లైన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
రీసెంట్గా కొత్త షెడ్యూల్ను స్టార్ట్ చేయగా, ఇందులో భాగంగా సోమవారం (Sept8) నుంచి సాంగ్ షూట్ జరగనుంది. దీనికోసం నయనతార ఆదివారమే హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో ఈ సాంగ్ షూట్ జరగనుంది.
చిరంజీవి, నయనతారలపై చిత్రీకరించనున్న ఈ పాటకు మాస్ బీట్ను కంపోజ్ చేశారట భీమ్స్ సిసిరోలియో. విజయ్ పొలాకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఈ మాస్టర్ జానపద స్టెప్పులతో బాగా పాపులర్. గతంలో విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేసిన పాటలు ఆడియన్స్తో స్టెప్పులేయించాయి.
ALSO READ : దేశవ్యాప్త ప్రమోషన్ టూర్లతో ‘మిరాయ్’..
అందులో "నక్కిలేసు గొలుసు" (పలాస 1978), "పుష్ప పుష్ప", "గంగమ్మ తల్లి జాతర" సాంగ్ (పుష్ప 2: ది రూల్), రవితేజ మాస్ జాతర పాట, కోట బొమ్మాళి, డబుల్ ఇస్మార్ట్ వంటి హుషారైన గీతాలకు డ్యాన్స్ అందించాడు. ఈ సారి మెగాస్టార్ చిరుతో అవకాశం రావడంతో, ఎలాంటి బీట్స్ కంపోజ్ చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది.
2024 - It couldnt have been more better?Thank you so much for all the opportunities given to me by my directors, producers, artists ?.To all my cinematographers, music directors for the wonderful songs, editors,
— Polaki Vijay (@PolakiVijay) December 31, 2024
My assistant choreographers, Managers,dancers,audience ? pic.twitter.com/PUn3Iyi3GT
ఇకపోతే ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్తో సినిమాపై అంచనాలు పెరిగాయి.
