మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణకి , మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు మహేశ్ బాబు తల్లి మృతిపట్ల సంతాపం తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి ఆత్మకు శాంతి కలగాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఇందిరమ్మ ఆత్మకు శాంతి కలిగేలా భగవంతుడిని కోరారు నిర్మాత బండ్ల గణేశ్ బాబు. మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మహేశ్ బాబుకు ఎంతో ఇష్టమైన అమ్మ మృతి చాలా బాధాకరమని వారి..ఆత్మకు శాంతి చేకూరాలని రామజోగయ్యశాస్త్రి కోరారు.