Megastar Chiranjeevi: తండ్రిగా చాలా గర్వపడుతున్నా.. పుత్రోత్సాహంలో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

Megastar Chiranjeevi: తండ్రిగా చాలా గర్వపడుతున్నా.. పుత్రోత్సాహంలో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం పుత్రోత్సవాహంలో ఉన్నారు. కొడుకు రామ్ చరణ్(Ram Charan) సాధించిన విజయాలను చూసి గర్వంగా ఫీలవుతున్నారు. తాజాగా రామ్ చరణ్ కు చెన్నై వేల్స్ యువర్సిటీ డాక్టరేట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ అందించిన సేవలకు గాను వేల్స్ యూనివర్ససిటీ ఈ డాక్టరేట్ ను అందించింది. ఈ వేడుక ఏప్రిల్ 13న జరిగింది. ఈ కార్యక్రంలో భాగంగా రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అయితే కొడుకు రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవాడంపై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ప్రముఖ విద్యాసంస్థ వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడం అనేది ఒక తండ్రిగా నన్ను ఎమోషనల్ గానూ, గర్వించేలా చేసింది. ఇది ఆనందకరమైన క్షణం. తల్లిదండ్రుల విజయాలను పిల్లలు అధిగమించినప్పుడే వారికి నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ తన కెరీర్ లో చాలా స్థిరంగా ముందుకు సాగుతున్నాడు.. పైకి ఎదుగుతున్నాడు. లవ్ యూ మై డియర్ డా.రామ్ చరణ్.. అంటూ ఎమోషనల్ ట్వీట్ చేసారు చిరంజీవి. దీంతో చిరు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరు దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చరణ్ విషయానికి వస్తే.. ఆయన స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.