నారాయణపేటలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : చిట్టెం పర్ణికా రెడ్డి

నారాయణపేటలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి : చిట్టెం పర్ణికా రెడ్డి

నారాయణపేట, వెలుగు: పట్టణంలోని ప్రతి వార్డులో శానిటేషన్ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు వార్డులో ఎమ్మెల్యే ఆదివారం మార్నింగ్ వాక్​ నిర్వహించారు. ప్రజలను కలుసుకుంటూ సమస్యలు తెలుసుకున్నారు.

 డ్రైనేజీ , సీసీ రోడ్లు సరిగా లేవని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు తన క్యాంప్​ ఆఫీస్​కు రావాలని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ, కౌన్సిలర్లు సలీం, మహేశ్​, సత్యా రఘు, కాంగ్రెస్ నాయకులు బండి వేణుగోపాల్, మనోహర్ ప్రసాద్ గౌడ్ ఉన్నారు.