
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 3 రోజుల పాటు ‘ఛూ మంతర్’ కార్యక్రమం నిర్వహిస్తామని ఇంటర్నేషనల్ మెజీషి యన్స్ కన్వెన్షన్ చైర్మన్ సామల వేణు తెలిపారు. శనివారం ‘ఛూ మంతర్ 2023’ పోస్టర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాల ను వేణు ప్రకటించారు. 9 నుంచి 11 వరకు హైదరాబాద్లోని హరిహర కళా భవన్లో ఛూమంతర్ 12వ జాతీయ, అంతర్జాతీయ మెజీషియన్స్ కన్వెన్షన్నిర్వహిస్తామని తెలిపారు.
చీఫ్ గెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హాజరవుతారని చెప్పారు. వివిధ దేశాలకు చెందిన 500 మంది మెజీషియన్లు ఈ సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. మ్యాజిక్పై లెక్చర్లు, డెమోలు, సెమినార్లు, మెజీషి యన్ల మధ్య పోటీలు ఉంటాయని, మ్యాజిక్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే ఇది పెద్ద సదస్సు అని చెప్పా రు. 1996 నుంచి ఛూ మంతర్ నిర్వహిస్తున్నామని వేణు వెల్లడించారు.