విడాకులు కన్ఫర్మ్ చేసిన సామ్ చై

విడాకులు కన్ఫర్మ్ చేసిన సామ్ చై

హైదరాబాద్: యువ హీరో అక్కినేని నాగచైతన్య-సమంత జంట వైవాహిక బంధం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తమ విడాకుల గురించి నాగ‌చైత‌న్య‌, సమంత కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. వెండితెరపై హీరో హీరోయిన్లుగా వెలుగొందుతున్న నాగచైతన్య, సమంతలు కొద్ది రోజులుగా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్న విషయం బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన నాగచైతన్య బ్లాక్ బస్టర్ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కు సమంత డుమ్మా కొట్టడం.. అక్కినేని నాగార్జున ఇంట విందుకు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హాజరైనప్పుడు సైతం సమంత కనిపించకపోవడంతో వదంతులు బలంగా వినిపించాయి. కొద్ది రోజుల మౌనం తర్వాత ఎట్టకేలకు ఇరువురూ వైవాహిక బంధాన్ని తెంచేసుకుని స్నేహితులుగా కలసి ఉంటామంటూ ప్రకటించారు. దశాబ్దకాలంగా ఇరువురమూ కలసి జీవించామని.. ఈ కష్టకాలంలో మీడియా, అభిమానులు తమకు సహకరించాలని వారు కోరారు.

సోషల్ మీడియాలో ప్రకటన యధాతథంగా...

చాలా చర్చలు మరియు ఆలోచనల తర్వాత సామ్ మరియు నేను మా స్వంత మార్గాలు కొనసాగించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దశాబ్ద కాలానికి పైగా స్నేహాన్ని కలిగి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం.

ఈ కష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని మరియు మాకు అవసరమైన గోప్యతను అందించాలని మా అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు మీడియాను మేము అభ్యర్థిస్తున్నాము..

ముందుకు సాగండి..

మీ మద్దతుకు ధన్యవాదాలు...

నాగ చైతన్య- సమంత స్టేట్ మెంట్ ఇదే..