భారతదేశం తన అణ్వాయుధ సామర్థ్యాలు విస్తరించేందుకు, కొత్త న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్లను అభివృద్ధి చేస్తున్నట్లు స్వీడన్కు చెందిన థింక్– ట్యాంక్ సిప్రి వెల్లడించింది. థింక్ ట్యాంక్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. సుదూర లక్ష్యాలు టార్గెట్ చేసే ఆయుధాలు డెవలప్ చేయడానికి భారత్ కసరత్తు చేస్తోంది. పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా నుంచి పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు వల్ల ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భారత్తో పాటు పాకిస్థాన్కూడా తమ అణ్వాయుధాలు విస్తరించడం, అణు డెలివరీ సిస్టమ్ లు అభివృద్ధి చేస్తోంది.
చైనా అంతటా లక్ష్యాలను ఈజీగా చేరుకునే సామర్థ్యంతో కూడిన వెపన్స్ తయారు చేయడానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోందని సిప్రీ ఇయర్ బుక్ 2023లో పేర్కొంది. ఇండో పసిఫిక్ సముద్రంలో మారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా బల ప్రదర్శన, సైనిక ఆధునికీకరణ ఈ పరిస్థితులను గమనించి భారత్ అప్రమత్తమైంది. సుదూర శ్రేణి అణ్వాయుధాలపై దృష్టి సారించడం, చైనాకు వ్యతిరేకంగా తన సామర్థ్యాలను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. 5,000 కి.మీ. లక్ష్యాన్ని ఛేదించే అగ్ని – వీ వంటి శ్రేణి బాలిస్టిక్ క్షిపణులకు రక్షణ మంత్రిత్వ శాఖ మరిన్ని మెరుగులు దిద్దుతోంది.
చైనాలో పెరిగిన వెపన్స్..
సిప్రీ నివేదిక అంచనా ప్రకారం.. 2022 జనవరిలో చైనా అణు ఆయుధాలు 2022లో 350 వార్హెడ్ల నుంచి 2023 జనవరి నాటికి 410కి పెరిగాయి. ప్రస్తుతం ఇండియాలో 164 అణు వార్హెడ్లు ఉన్నాయి.