హైదరాబాద్, వెలుగు : ఏటీఎం మెషీన్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై పెప్పర్ స్ర్పే చల్లి రూ.7 లక్షలు దోపిడీ చేసిన కేరళకు చెందిన నలుగురిని సిటీ సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.25 లక్షల క్యాష్, పెప్పర్ స్ప్రే బాటిల్స్, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం మీడియాకు వెల్లడించారు. కేరళకు చెందిన ముజీబ్.. హిమాయత్నగర్లో ఉంటున్నాడు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మనీ ట్రాన్జాక్షన్స్ చేస్తున్నాడు. హవాలా మార్గంలో సేకరించిన డబ్బును ఏటీఎం మెషీన్లలో డిపాజిట్ చేసేవాడు. ఇందుకోసం హిమాయత్నగర్లోని ఉర్దూ గల్లీలోఉండే కేరళకు చెందిన తన్సిఫ్ అలీ(24) సాయం తీసుకున్నాడు. ఇది గమనించిన తన్సిఫ్.. దోపిడీకి ప్లాన్ చేశాడు. కేరళకు చెందిన సహద్ (26), తనిష్ బరిక్కల్ (23), అబ్దుల్ ముహీస్ (23)తో కలిసి స్కెచ్ వేశాడు. ఈ నెల 3న వారు ముజీబ్ను అనుసరించారు. ఆరు ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్ చేస్తున్న ముజీబ్ను తన్సిఫ్, అతని స్నేహితులు వెంబడించారు. హిమాయత్నగర్ లిబర్టీ వద్ద ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్యాష్ డిపాజిట్ సెంటర్ను తమకు అనుకూలమైన ప్రదేశంగా నిందితులు ఎంచుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో ముందుగా ఇద్దరు ఏటీఎంలోకి వెళ్లారు. మరో ఇద్దరు కారులో కూర్చుని పరిసరాలను గమనించారు. ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన ముబీబ్పై ఆ ఇద్దరు పెప్పర్ స్ప్రే కొట్టి రూ.7 లక్షలు దోచుకుని పరారయ్యారు. ముజీబ్ ఫిర్యాదుతో దోమలగూడ పోలీసులు కేసు ఫైల్ చేశారు. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలు,సెల్ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
పెప్పర్ స్ర్పే కొట్టి రూ. 7 లక్షల దోపిడీ
- క్రైమ్
- July 16, 2023
లేటెస్ట్
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- కేఎఫ్ లైట్ బీర్లు దొరకట్లేదని ప్రభుత్వానికి లేఖ
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- SreeLeela: స్టార్ హీరోతో శ్రీలీల ఐటమ్ సాంగ్..ఈ జోడీ డ్యాన్స్ నంబర్తో మోతమోగాల్సిందే!
- ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్ టైరు ఊడింది.. విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..
- నన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- V6 DIGITAL 29.04.2024 EVENING EDITION
- మోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
- గాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు
- సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్