హైదరాబాద్, వెలుగు : సిటీ స్టార్టప్ పౌల్ట్రీమాన్ త్వరలో మరో రెండు మిలియన్ డాలర్ల వరకు (రూ.16.4 కోట్ల) ఫండ్స్ను సేకరించనుంది. ఇది కోళ్లఫారాల్లో, హాచరీల్లో ఉష్ణోగ్రత, తేమ, అమ్మోనియా, వాటర్ పీహెచ్ వంటి వివరాలను యాప్ ద్వారా ఓనర్కు అందిందిస్తుంది. ఇది వరకే ఇద్దరు ఇన్వెస్టర్ల నుంచి రూ.ఐదు కోట్ల ఇన్వెస్ట్మెంట్లు సేకరించామని సంస్థ ఎండీ చిందం శ్రీనివాస్ చెప్పారు. ఈ విషయమై ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ ‘‘ఐటీసీ అగ్రో సీనియర్ ఎగ్జిక్యూటివ్ శివకుమార్తో పాటు పాన్టాక్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ మా స్టార్టప్లో పెట్టుబడులు పెట్టింది. సొంతంగా నేను రూ.3 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మరో 1–2 మిలియన్ డాలర్లను వీసీ కంపెనీల నుంచి సేకరిస్తాం.
మాకు ఐఐటీ–కాశీపూర్, కేంద్రం ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కూడా వచ్చాయి. మేం అందజేసే ఐఓటీ డివైజ్, స్మార్ట్ఫోన్ యాప్ ద్వారా కోళ్లఫారాల్లో, హాచరీల్లోని వివరాలను రియల్టైంలో తెలుసుకోవచ్చు. నెట్లోని లేని చోట శాటిలైట్ టెక్నాలజీని వాడేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో ఎగ్గ్రేడింగ్, బర్డ్ బిహేవియర్ టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తాం. పౌల్ట్రీమాన్ టెక్నాలజీకి పేటెంట్ ఉంది. ప్రస్తుతం మాకు 40 మంది కస్టమర్లు ఉన్నారు. వీటిలో సుగుణ, గోద్రెజ్ వంటి పెద్ద కంపెనీలూ ఉన్నాయి. విదేశీ మార్కెట్లలోకి కూడా వెళ్తాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల టర్నోవర్ సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లు వస్తాయని అనుకుంటున్నాం’ అని అన్నారు.