యధావిధిగా టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్

యధావిధిగా టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్

హైదరాబాద్ : అక్టోబర్ 5న తెలంగాణ భవన్ లో నిర్వహించనున్న టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రభావం సర్వసభ్య సమావేశంపై ఉండదని స్పష్టం చేశారు. సభ్యులెవరూ గందగోళానికి గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించనట్లే అక్టోబర్ 5 దసరా నాడు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో మీటింగ్ కొనసాగుతుందని చెప్పారు. సభ్యులంతా నిర్దేశిత సమయానికి హాజరుకావాలని స్పష్టం చేశారు.

జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. దసరా పండుగ రోజు పార్టీ పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కు పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలతో పాటు జిల్లాల నేతలు రానున్నారు. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ మీటింగ్పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వాహణపై స్పష్టతనిచ్చారు.