ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ నేతలు పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ నిర్వహించిన పార్టీ నేతలు.. ఆ తర్వాత చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఆఫీస్ కోసం ఢిల్లీలోని వసంత్ విహార్లో 1300 గజాల స్థలం కేటాయించింది కేంద్రప్రభుత్వం. దాంట్లో G+3 గా ఆఫీస్ను నిర్మించనున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐలకు ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి. సమాజ్ వాదీ పార్టీ కూడా ఆఫీస్ కట్టుకుంటోంది. సౌత్ ఇండియాలో ఏ పార్టీకి కూడా ఢిల్లీలో ఆఫీస్ లేదు. టీఆర్ఎస్ మాత్రమే ఢిల్లీలో ఆఫీస్ కట్టబోతోంది.