సీఎం కేసీఆర్ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు

సీఎం కేసీఆర్ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు

సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. 25 మందితో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పట్టణంలోని శాంతినగర్ కు రాగానే.. ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న ఓ గుంతలో ఇరుక్కుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ రైలింగ్ పై పడింది. దీంతో ట్రాక్టర్ లో ఉన్న ఆరుగురు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

ప్రత్యక్ష సాక్షి..

బహిరంగ సభకు ట్రాక్టర్ లో బయలుదేరిన ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలో జరగనున్న సీఎం కేసీఆర్ సభకు మొత్తం 25 మంది ఉర్లగొండ, వల్లభాపురం గ్రామస్థులు ట్రాక్టర్ లో బయలుదేరినట్లు వెల్లడించారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ దగ్గరకు రాగానే రోడ్డుపై ఉన్న ఓ గుంతలో ఇరుక్కుపోయినట్లు తెలిపాడు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ఓ పక్కకు ఒరిగి.. రైలింగ్ పై పడగా.. స్థానికుల వారిని కాపాడినట్లు చెప్పాడు.