ఢిల్లీకి వెళ్లి ఎవ్వరినీ కలవని సీఎం కేసీఆర్

 ఢిల్లీకి వెళ్లి ఎవ్వరినీ కలవని సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులు పరిశీలించడం మినహా ఆయన ఎవరినీ కలవలేదు. తన అధికారిక నివాసానికే పరిమితమయ్యారు. ఈ నెల 11న మాజీ సీఎం ములాయం సింగ్ అంత్యక్రియల కోసం స్పెషల్ ఫ్లైట్‌‌లో ఉత్తరప్రదేశ్‌‌కు వెళ్లిన కేసీఆర్.. అదే రోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీని బీఆర్‌‌‌‌ఎస్‌‌గా మార్చిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్లడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆయన కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ, ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు.

బీఆర్‌‌‌‌ఎస్ కోసం ఢిల్లీలో కొత్తగా తీసుకున్న బిల్డింగ్‌‌లో మరమ్మతు పనులు, పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ రెండు మినహా సీఎం కేసీఆర్‌‌‌‌ ఎక్కడికీ పోలేదు. మరో రెండ్రోజులు కేసీఆర్‌‌‌‌ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఈ ఏడాదిలో ఇది ఐదోసారి. కేంద్రంలో బీజేపీతో దూరం పెరిగినప్పటి నుంచి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ 4 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఆయన అక్కడే 
ఉంటున్నారు.