అంబేద్కర్ రాజ్యాంగంపై కేసీఆర్ దాడి చేస్తున్నారు

అంబేద్కర్ రాజ్యాంగంపై కేసీఆర్ దాడి చేస్తున్నారు

హైదరాబాద్: అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై కేసీఆర్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. సీఎం కేసీఆర్ కు  పాలన చేతకాక రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ ఆర్టికల్ 3 ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్ కృషితోనే తెలంగాణ ఏర్పాటు సాకారం అయిందన్నారు.  గాంధీ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. అంతకు ముందు ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు.

ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ దేశంలో అందరూ స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రం అంబేద్కర్ రాజ్యాంగంతోనే సాకారమైందన్నారు. అలాగే పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు కల్పించారని.. మహిళలకు ఓటు హక్కు కూడా కల్పించింది మన రాజ్యాంగమేనని గుర్తు చేశారు. ఎంతో మహోన్నతమైన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ దేశ వ్యాప్తంగా తిరిగి చెబుతానంటున్నాడని విమర్శించారు.  

 

ఇవి కూడా చదవండి

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు ప్రవీణ్ కుమార్ నివాళులు

స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఆలియా–రణబీర్ ఇంట్లో పెళ్లి సందడి షూరూ