కులగణనపై సీఎం రేవంత్​కు చిత్తశుద్ధి లేదు

కులగణనపై సీఎం రేవంత్​కు చిత్తశుద్ధి లేదు
  • బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్​

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డికి కులగణనపై చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్​ నేత దాసోజు శ్రవణ్​అన్నారు. కేవలం రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే కులగణన చేస్తున్నామని సీఎం చెప్పడం అగ్రకుల ఆధిపత్య అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ ​చేశారు. ‘‘బీసీల అభ్యున్నతిపై తనకు బాధ్యత లేనట్టుగా సీఎం మాట్లాడటం.. నమ్మకద్రోహం, సామాజిక నేరం, రాజ్యాంగ ఉల్లంఘనే. సీఎం సీట్లో కూర్చున్నా కూడా రేవంత్​రెడ్డికి అగ్రవర్ణ అహంకారం పూర్తిగా పోయినట్టు లేదు. ఇలాంటి వివక్షాపూరిత కులాధిపత్య మనస్తత్వం ఉన్న రేవంత్​రెడ్డి.. సీఎం సీట్లో కూర్చునేందుకు అనర్హుడు. కులగణన నిర్వహించేందుకు ఆయనకు ఏమాత్రం నైతికత లేదు. బీసీలకు న్యాయం చేయలేరు” అని దాసోజు శ్రవణ్ అన్నారు.