గత ప్రభుత్వంలో ఆడబిడ్డలను పలకరించలేదు

గత ప్రభుత్వంలో ఆడబిడ్డలను పలకరించలేదు

ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్​ అగ్రికల్చర్​ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ఆడబిడ్డలంటే తనకెంతో గౌరవమంటూ.... గత ప్రభుత్వంలో వారిని ఎవరూ పలకరించలేదన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్​ బిల్ తో మహిళలకు రాజకీయంగా రిజర్వేషన్​ కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 30కి పైగా మహిళలకు అసెంబ్లీ సీట్లు వస్తాయన్నారు. 

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి  ఇందిరా మహిళా శక్తి పథకాలు రూపొందించామన్నారు.  తెలంగాణలో స్కూళ్ల బాధ్యతతో పాటు వెయ్యి మెగావాట్ల పవర్​ ప్లాంట్ల నిర్మాణం.. ఆర్టీసీబస్సులకు  మహిళలనే ఓనర్లు చేశామన్నారు.