
లక్నో సూపర్ జెయింట్స్కు టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ గుడ్ బై చెప్పాడు. గత ఏడాది లక్నో మెంటర్గా బాధ్యతలు చేపట్టిన జహీర్ వచ్చే సీజన్ (2026)కు ముందు ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. లక్నో ఫ్రాంచైజ్ యాజమాని సంజీవ్ గోయెంకా తీరు నచ్చక గతంలో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే. తాజాగా జహీర్ ఖాన్ కూడా అదే రీజన్తో లక్నోకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. సంజీవ్ గోయెంకా, లక్నో హెడ్ కోచ్ జస్టిస్ లాంగర్ తీరు నచ్చకే జహీర్ ఆ జట్టు నుంచి వైదొలిగినట్లు సమాచారం.
జహీర్ ఖాన్ గతేడాది లక్నో మెంటర్గా బాధ్యతలు చేపట్టాడు. వేలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ను ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ ధరకు (27 కోట్లు) కొనుగోలు లక్నో కొనుగోలు చేయడంలో జహీర్ కీలకంగా వ్యవహరించాడు. కానీ జహీర్ వ్యూహాలు ఫలించలేదు. గత సీజన్లో లక్నో కెప్టెన్గా, ఆటగాడిగా రిషబ్ పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. కానీ జహీర్ అమలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ ఓపెనింగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.
ఇదే సమయంలో లక్నో బౌలింగ్ దళం పూర్తిగా తెలిపోవడంతో ఆ జట్టు 14 మ్యాచుల్లో కేవలం ఆరు విజయాలకే పరిమితమై ఏడో స్థానంలో నిలిచింది. 2022లో ఐపీఎల్కు ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫస్ట్ రెండు సీజన్లు ప్లే ఆఫ్స్కు చేరుకుంది. కానీ జహీర్ను మెంటర్గా తీసుకున్న సీజన్లో ఆ జట్టు పూర్ ఫెర్మాఫెన్స్ చేసింది. 7వ స్థానంలో నిలిచి కనీసం ప్లే ఆఫ్స్కు చేరుకోలేకపోయింది.
దీంతో జహీర్ పని తీరుపై లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్. అదే సమయంలో గోయెంకా, లక్నో కోచ్ లాంగర్ తీరుపై కూడా జహీర్ కు నచ్చలేదని సమాచారం. ఈ కారణంతోనే లక్నో జట్టుకు జహీర్ వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. లక్నో గుడ్ చై చెప్పిన జహీర్.. వచ్చే ఏడాది ఏ జట్టుతో జత కడతారో చూడాలి.