
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఏపీ అభివృద్ధికి రావాల్సిన నిధులతో పాటు పోలవరం, విభజన హామీల గురించి ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో కూడా సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన G20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా సీఎం జగన్ పాల్గొన్నారు.