సింగరేణిలో సీఎం హామీలు నెరవేరలేదు

సింగరేణిలో సీఎం హామీలు నెరవేరలేదు
  •  బీఎంఎస్​ స్టేట్ ​వర్కింగ్ ​ప్రెసిడెంట్ పేరం రమేశ్

నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్లను సాధించడం బీఎంఎస్ యూనియన్​తోనే సాధ్యమని సింగరేణి కోల్​మైన్స్​ కార్మిక సంఘ్(బీఎంఎస్) స్టేట్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ పేరం రమేశ్​అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్​లోని యూనియన్​ ఆఫీస్​లో బీఎంఎస్ ​ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్​స్థాయిలో కార్మికుల సమస్యలపై పోరాటాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ ​చేయాలన్నారు. 

11వ వేతన ఒప్పందం సాధించడంలో బీఎంఎస్ ​యూనియన్, నేషనల్​ లీడర్, జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి కీలకంగా వ్యవహరించాని, 23 నెలల ఎరియర్స్​ఇప్పించడంలో కోల్​ మినిస్టర్​ ద్వారా సర్క్యూలర్​ జారీ చేయించారని తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్.. ​బీఆర్ఎస్​సర్కార్​ చెప్పుచేతుల్లో సింగరేణి కంపెనీని పెట్టిందని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాస్తోందని, ఐదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదన్నారు. 

వచ్చే గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్​ను కార్మికులకు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్కే6 గనిలోని పలువురు బీఎంఎస్​లో చేరారు. కార్యక్రమంలో యూనియన్​ కేంద్ర కమిటీ సభ్యులు కాదాసు భీమయ్య,  ఏరియా జాయింట్ సెక్రెటరీ పోడిశెట్టి వినోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు పూనం రామకృష్ణ, రాకేశ్, డివిజన్, కమిటీ సభ్యుడు బొడిగ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.