- రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండరని మాట తప్పిన కేసీఆర్
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి
నస్పూర్/మందమర్రి, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి కోలిండియాలో అమలు చేస్తున్న హైపవర్ కమిటీ వేతనాలను ఇవ్వాలని బీజేపీ నేషనల్ఎగ్జిక్యూటివ్కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండరని చెప్పిన సీఎం కేసీఆర్మాట తప్పారని దుయ్యబట్టారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. బోర్డ్ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్) లిస్ట్ లో ఉన్న సింగరేణికి ఎన్టీపీసీ నుంచి రూ. 400 కోట్ల లోన్ ఇప్పించి లక్ష మంది కార్మిక కుటుంబాలను తన తండ్రి వెంకటస్వామి కాపాడారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం టైంలో కాంట్రాక్ట్ కార్మికులు ఇక ఉండరని కేసీఆర్ మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పడమే కాకుండా సంస్థ ఫండ్స్ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఎస్సార్ ఫండ్స్ను సిద్దిపేటలో ఫుట్బాల్ స్టేడియానికి తరలించారన్నారు.
సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదు
సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తోందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తాడిచెర్ల మైన్స్ను కేసీఆర్ సర్కార్ ప్రైవేటుపరం చేసిందని, సింగరేణిలో కాంట్రాక్టు పనులను మెల్లమెల్లగా అమలు చేస్తోందన్నారు. బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ.. కోలిండియా బెనిఫిట్స్ను సింగరేణిలో వర్తింపజేస్తూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్చేశారు.
జీఎం ఆఫీస్ఎదుట ఉద్రిక్తత
దీక్ష అనంతరం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం సురేశ్కు వినతిపత్రం అందించేందుకు వెళ్లగా జిల్లా ప్రెసిడెంట్, లీడర్లను గేటు వద్ద పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు రఘునాథ్ తోపాటు కొంతమంది కాంట్రాక్టు కార్మికులు వెళ్లి జీఎంకు వినతిపత్రం అందజేశారు. దీక్షలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అగల్డ్యూటీ రాజు, లీడర్లు పానుగంటి రంగారావు, మునిమంద రమేశ్, తుల మధుసూదన్, బీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్బరుపాటి మారుతీ తదితరులు పాల్గొన్నారు.