కంపెనీ లెవల్ కల్చరల్ పోటీల్లో సత్తాచాటారు .. కోలిండియా పోటీలకు ఎంపికైన సింగరేణి కళాకారులు

 కంపెనీ లెవల్ కల్చరల్ పోటీల్లో సత్తాచాటారు .. కోలిండియా పోటీలకు ఎంపికైన  సింగరేణి కళాకారులు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి కంపెనీ లెవల్ ​కల్చరల్​మీట్ పోటీలు బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ సీఈఆర్​క్లబ్​లో ఉత్సాహంగా ముగిశాయి. 6 జిల్లాల్లోని11 ఏరియాలకు నుంచి 220 మంది కళాకారులు హాజరై ప్రదర్శనలు ఇవ్వగా  అలరించాయి.  ఫోక్​ డ్యాన్స్​లో ఎన్​.శ్రీనివాస్ టీం(మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు)  ప్రథమ, అడిచెర్ల శ్రీనివాస్ టీం(రామగుండం–3, భూపాలపల్లి) రెండో, కవ్వాలి గ్రూప్ ​విభాగంలో ప్రథమ  జలపతి టీం(రామగుండం1,2 ఏరియాలు),  ద్వితీయ బి.కుమారస్వామి టీం (రామగుండం3,భూపాలపల్లి), ఆర్కెస్ర్టా విభాగంలో ఎస్.డేవిడ్​రాజ్ టీం(మణుగూరు,ఇల్లందు) ప్రథమ  , ఆర్​.నోవాశ్యాం టీం(రామగుండం1,2) రెండో స్థానంలో నిలిచాయి. 

భజన విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో సీహెచ్.శంకర్​,కె.శంకరయ్య, లైట్​మ్యూజిక్ ​లో దార సుశీల, కె.శ్రీనివాస్​,కీర్తన అంశంలో పవన్​కుమార్,శివకుమార్, ఫోక్​సాంగ్​లో నారాయణ,ప్రభాకర్​,గజల్​ విభాగంలో కె.శ్రీనివాస్​,బి.రాకేశ్​,కర్నాటక సంగీతంలో శ్రీనిధి,పవన్​కుమార్​,గీత్​ అంశంలో జంపయ్య, కార్తీక్​, ఫ్లూట్​లో రవీంద్రకుమార్​,రామారావు, తబలా విభాగంలో అనిల్​కుమార్​,జె.శ్రీనివాస్​,గీటార్​లో దుర్గాకోటి,శ్యాంసన్, మౌత్​ ఆర్గన్​  అంశంలో ఆదిల్​మహ్మమద్,​ వీపీ రావు, వయోలిన్ విభాగంలో రవికుమార్, సంపత్, బంజో అంశంలో ఎస్​.ప్రభాకర్, పి.శంకర్, సింథ​సిజర్​లో పి.ఏసోబు, నోవా శ్యాం, కూచిపూడి విభాగంలో శ్రీనివాస్, తాంబిరాజ్, భరత నాట్యంలో శ్రీకాంత్, తాంబిరాజ్, హ్యుమరస్​ స్కిట్​లో ప్రథమస్థానం వేమనచారి, రెండో స్థానంలో వాసాల రమేశ్​ నిలిచారు. 

సింగరేణి కంపెనీ లెవల్​ కల్చరల్​ మీట్​లో ఆయా అంశాల్లో ప్రథమస్థానంలో నిలిచిన కార్మిక,ఉద్యోగ కళకారులు,గ్రూపు మెంబర్లు  కోలిండియా పోటీలకు ఎంపికయ్యారని, నెల 25 నుంచి 27 వరకు మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో వెస్ర్టన్​ కోల్​ఫీల్డ్స్​ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారని సింగరేణి యాజమాన్యం పేర్కొంది.  

బహుమతుల ప్రదానోత్సవానికి మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ, ఏరియా పర్సనల్ మేనేజర్​ శ్యాంసుందర్​,సింగరేణి గుర్తింపు సంఘం కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ,సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్​ ప్రెసిడెంట్ రమేశ్,క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్​,సింగరేణి స్పోర్ట్స్​ సూపర్​వైజర్లు తదితరులు పాల్గొన్నారు.​