న్యూఢిల్లీ: సముద్ర మార్గం గుండా మాదక ద్రవ్యాలను తరలిస్తున్న 9 మంది ఇరాన్ జాతీయులను భారత నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. బోటు ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో కోస్ట్గార్డ్, మెరైన్ టాస్క్ఫోర్స్, అంటీ టెర్రరిస్ట్ స్వాడ్ లు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఘటనలో బోటులో ఉన్నవారంతా తమ వద్దనున్న సాక్ష్యాలు దొరకకుండా బోటును కాల్చేశారని ఓ అధికారి తెలిపారు. మిగిలిన ఆధారాల కోసం ప్రయత్నించే క్రమంలో బోటు పూర్తిగా నీట మునిగిందని ఆయన అన్నారు. ఆ 9 మందిని అరెస్ట్ చేసిన తర్వాత వారి వద్ద నుంచి వంద కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.