భూ సేకరణ స్పీడప్ చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

భూ సేకరణ స్పీడప్ చేయాలి :  కలెక్టర్  ఆదర్శ్  సురభి

వనపర్తి, వెలుగు: జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ స్పీడప్​ చేయాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​లో ప్రాజెక్టుల భూసేకరణపై ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణప సముద్రంకు సంబంధించి 18 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగిందని, మిగిలిన భూసేకరణ కోసం పట్టాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. 

గోపాల్​పేట మండలం బుద్ధారం రిజర్వాయర్​కు సంబంధించి సబ్  డివిజనల్  రికార్డు, ఎంజాయ్​మెంట్  రిపోర్ట్  అందజేయాలని ఆదేశించారు. బీమా ప్రాజెక్టుకు సంబంధించిన 26 ఎకరాలను వేగంగా సేకరణ చేయాలన్నారు. ఇరిగేషన్​ ఈఈ మధు, ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మెడికల్  రిజిస్ట్రేషన్  అథారిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ రావుల గిరిధర్, అడిషనల్​ కలెక్టర్​ యాదయ్య, డీఎంహెచ్​వో శ్రీనివాసులు, డాక్టర్లు  శ్రీనివాస్, చిన్నమ్మ థామస్  పాల్గొన్నారు.

విద్యార్థుల సంఖ్య​పెంచాలి

పెబ్బేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. బుధవారం మండలంలోని అయ్యవారిపల్లె జడ్పీ హైస్కూల్​ను కలెక్టర్  తనిఖీ చేశారు. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగాలే తప్ప తగ్గవద్దన్నారు. ఏఐ ద్వారా విద్యార్థులకు చదువు నేర్పించేందుకు ఏర్పాటు చేసిన క్లాస్​ రూమ్​ను సందర్శించారు. తహసీల్దార్  మురళి, ఎంఈవో జయరాములు, మహానంది ఉన్నారు.