కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి :  కలెక్టర్ అనురాగ్ జయంతి

కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి :  కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: 3న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. , ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ అధికారులు సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ ​సూచించారు. లెక్కింపు రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపాలన్నారు.

కౌంటింగ్ అధికారులు, సిబ్బంది  తమకు నిర్దేశించిన విధుల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యుత్​అంతరాయం లేకుండా చూసుకోవడంతోపాటు జనరేటర్, నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన వెంటన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను నిబంధనలను అనుసరించి భద్రపరచాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అడిషనల్​కలెక్టర్ గౌతమ్ రెడ్డి, రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్,  మధుసూదన్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బి.గంగయ్య పాల్గొన్నారు. స్ట్రాంగ్  రూమ్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్ఆర్​గవర్నమెంట్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌‌‌‌‌‌‌‌ను అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్​పమేలా సత్పతి శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్​నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. కార్యక్రమంలో రిటర్నింగ్​అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు  బండ రమణారెడ్డి,  సత్తినేని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.