ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి :   కలెక్టర్ ఆశిష్  సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 11,679 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు.  ఎంపీడీవోలు, ఎంపీవోలు ఇండ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని, జిల్లా అధికారులు  మార్గనిర్ధేశం చేయాలన్నారు.   ఇంకా ప్రారంభం కాని ఇంటికి  వెంటనే మార్కవుట్ ఇవ్వాలన్నారు. మార్కవుట్​ వచ్చిన ఇండ్లు బెస్మిట్ లెవల్​కు వచ్చేలా చూడాలన్నారు.  రుణ మంజారుపై ఐకేపీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.  

నిర్ధేశించిన లక్ష్యాలను 15 రోజుల్లోగా కంప్లీట్​ చేసేందుకు అధికారులు బాధ్యత వహించాలన్నారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్​ చందర్​ నాయక్,  హౌజింగ్​ పీడీ విజయ్​పాల్​రెడ్డి,  డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళీ పాల్గొన్నారు.  

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి 

 జిల్లాలోని వడ్ల కొనుగోలు సెంటర్లలో వసతులు కల్పించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ అధికారులను ఆదేశించారు. బుధవారం వడ్ల కొనుగోలుపై  కలెక్టర్లు, అధికారులతో  అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు,  సివిల్ సప్లయ్​ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి,  స్పోర్ట్స్​ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అనంతరం కలెక్టర్​ జిల్లా అధికారులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. నీళ్లు నిల్వ లేని ఏరియాలోనే సెంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి సెంటర్​లో టార్పాలిన్లు అందుబాటులో ఉండాలన్నారు.  

 కాంటా అయిన వెంటనే టాబ్​లో ఎంట్రీ చేయాలని, రైతులకు 48 నుంచి 72 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్,   ట్రైనీ డిప్యూటీ కలెక్టర్​ రవితేజ, డీఆర్డీవో సురేందర్,  సివిల్​ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్​రావు, డీఎం శ్రీకాంత్, జిల్లా వ్యవసాయాధికారి మోహన్​రెడ్డి, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.