
కామారెడ్డి, వెలుగు : మిల్లర్లు సీఎంఆర్ కంప్లీట్ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో సీఎంఆర్పై అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన మీటింగ్లో మాట్లాడారు. వానాకాలం సీజన్ సీఎంఆర్ కంప్లీట్ చేసేందుకు జూలై 27 గడువు ఉందన్నారు. బ్యాంక్ గ్యారంటీలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జునబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
ప్లాస్టిక్ వాడటాన్ని తగ్గించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా కేంద్రంలోని మార్కెట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్టాస్టిక్ బ్యాగ్లకు బదులుగా జ్యూట్ బ్యాగులు వినియోగించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, జిల్లా సైన్స్ ప్రోగ్రాం, నేషనల్ గ్రీన్ కోర్ కన్వీనర్ సిద్దిరాంరెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సదాశివనగర్, వెలుగు: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం మండలంలోని యాచారం, వజ్జపల్లి తండాలో అభివృద్ధి పనుల పరిశీలనతోపాటు యాచారంలోని రెవెన్యూ సదస్సును సందర్శించారు. ‘భూభారతి’ ద్వారా పక్కా భూ పట్టా అందించనున్నట్లు తెలిపారు. యాచారంలో రేషన్ బియ్యం పంపిణీ ని పరిశీలించారు. వజ్జపల్లి తండాలో పశువుల షెడ్, పాం పాండ్ నర్సరీ, ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు.
మొక్కలను కాపాడుతున్న వజ్జపల్లి తండా పంచాయతీ సెక్రటరీ పాపిరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సతీష్యాదవ్, ఆర్డీవో వీణా, హాసింగ్ పీడీ విజయ పాల్ రెడ్డి, సివిల్ సప్లయ్అధికారి మల్లికార్ణున్, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ సత్యనారయణ, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఎంఈవో యోసెఫ్, ఏపీఎం రాజిరెడ్డి, ఏపీవో శ్రీనివాస్, ఏఈ సుచిత్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.