
యాదాద్రి, వెలుగు: దసరా పండుగకు గృహ ప్రవేశం చేసి పాలు పొంగిస్తామని కలెక్టర్ హనుమంతరావుకు పలువురు లబ్ధిదారులు తెలిపారు. ఆలేరు మండలం మందనపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు. నిర్మాణ బిల్లులు వచ్చాయా... అని అడిగి తెలుసుకున్నారు.
నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్సూచించగా.. దసరా పండుగకు గృహ ప్రవేశం చేసుకొని పాలు పొంగిస్తామని లబ్ధిదారులు తెలిపారు. అనంతరం గొలనుకొండలోని పల్లె దవాఖానను కలెక్టర్ తనిఖీ చేశారు. ట్రీట్మెంట్కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్బిణీలకు రెగ్యులర్గా చెకప్ చేయాలని ఆయన ఆదేశించారు.