నెలాఖరులోగా సీఎంఆర్​ కంప్లీట్​ చేయాలె : హనుమంతు జెండగే

నెలాఖరులోగా సీఎంఆర్​ కంప్లీట్​ చేయాలె : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు:  వానాకాలం​ 2022–-23 సీజన్​ సీఎంఆర్​నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్​ హనుమంతు జెండగే ఆదేశించారు. కలెక్టరేట్​లో సీఎంఆర్​ సేకరణ, వడ్ల కొనుగోళ్లపై  రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలంలో సీఎంఆర్​ కోసం జిల్లాలోని 44 మిల్లులకు 2.85 లక్షల టన్నుల వడ్లు కేటాయించినట్లు ఆఫీసర్లు తెలిపారు. 1.95 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఇప్పటివరకూ 1.65 లక్షల బియ్యాన్ని మిల్లర్లు పంపించారని వివరించారు.

అనంతరం కలెక్టర్‌‌ మాట్లాడుతూ.. సీజన్లు గడుస్తున్నా సీఎంఆర్​ పెండింగ్‌లో ఉండడం సరికాదని,  నెలఖారులోగా  వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.  2023-–24 సీజన్​ వడ్ల కొనుగోళ్ల గురించి సివిల్​సప్లై డీఎం గోపికృష్ణ మాట్లాడుతూ.. 2. 44 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్టు చెప్పారు.  20 వేల మంది రైతుల అకౌంట్లలో రూ. 430 కోట్లు జమ చేసినట్టు వివరించారు. రివ్యూ మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ ఏ భాస్కర్​రావు, డీసీఎస్​వో శ్రీనివాసరెడ్డి, రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్​ మెంబర్లు వెంకటేశ్​ సహా మిల్లర్లు ఉన్నారు.