గవర్నమెంట్ స్కూళ్లు పచ్చదనంతో కళకళలాడాలి : కలెక్టర్జితేశ్ 

గవర్నమెంట్ స్కూళ్లు పచ్చదనంతో కళకళలాడాలి : కలెక్టర్జితేశ్ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గవర్నమెంట్​ స్కూళ్లు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​అధికారులకు, టీచర్లకు సూచించారు. కొత్తగూడెంలోని ఆనందఖని స్కూల్​లో బుధవారం ‘పచ్చదనం–పరిశుభ్రత’లో జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన స్కూళ్లకు కలెక్టర్​ మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,673 స్కూళ్లకు గానూ ఆరు రూరల్​ విభాగం నుంచి ఆరు, అర్బన్​ ఏరియా నుంచి రెండు స్కూళ్ల​ను ఎంపిక చేసినట్టు తెలిపారు.

పాఠశాలలు పచ్చదనంతో మెరవాలన్నారు. అన్ని పాఠశాలు ఫైవ్​ స్టార్​ రేటింగ్​ సాధించేలా హెచ్​ఎంలు, టీచర్లు కృషి చేయాలని సూచించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో జిల్లా స్కూళ్లు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఇల్లెందు మండలంలోని సత్యనారాయణపురంతో పాటు అంజనాపురం, సంజయ్​ నగర్, బుడ్డగూడెం ప్రాథమిక పాఠశాలలు, భద్రాచలం పబ్లిక్​ స్కూల్​, అశ్వాపురంలోని సెంట్రల్​ గవర్నమెంట్​ ఆటమిక్​ఎనర్జీ స్కూల్, మొరంపల్లి బంజర జడ్పీ హైస్కూల్, పాల్వంచ కేజీబీవీ స్కూల్స్​ హెచ్​ఎంలు, టీచర్స్​, సిబ్బందిని కలెక్టర్​ అభినందించారు. ఈ ప్రోగ్రాంలో డీఈఓ బి.నాగలక్ష్మి, అసిస్టెంట్​ డైరెక్టర్​శంభు ప్రసాద్, కో ఆర్డినేటర్లు కె.సైదులు, నాగరాజశేఖర్​ పాల్గొన్నారు.