
- దేశంలోనే జిల్లా మొదటి స్థానానికి చేరువలో ఉంది
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంకుడు గుంతల నిర్మాణంలో దేశంలోనే మొదటి స్థానానికి చేరువులో భద్రాద్రికొత్తగూడెం జిల్లా చేరువలో ఉందని కలెక్టర్ జితేశ్వి పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో జిల్లా మొదటి స్థానంలో వస్తే రూ. 2కోట్లు బహుమతి వస్తుందని తెలిపారు. ప్రతీ ఇంకుడు గుంత ఫొటోను జేఎస్జీబీ పోర్టల్లో అప్ లోడ్ చేయాలని సూచించారు.
ఫారం పాండ్స్ నిర్మాణాలు ఎక్కువగా చేపడుతున్నట్లు తెలిపారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు దారుల సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక చేయాలని చెప్పారు. ఈ నెల 21 నుంచి 30 వరకు జిల్లా స్థాయి కమిటీ పరిశీలన తర్వాత అర్హులైన జూన్ 2న సాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక స్పీడప్ చేయాలని చెప్పారు.