
మంచిర్యాల, వెలుగు : గవర్నమెంట్స్కూళ్లలో విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ టీచర్లకు సూచించారు. బుధవారం నెన్నెల కేజీబీవీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. క్లాస్ రూమ్లు, రిజిస్టర్లు, కిచెన్ షెడ్, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ పిల్లలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్పెట్టాలన్నారు.
అనంతరం టెన్త్ స్టూడెంట్లకు ఫిజిక్స్ సబ్జెక్టులో పలు అంశాలను బోధించి వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. జడ్పీ హైస్కూల్కు వెళ్లిన కలెక్టర్అక్కడ నిర్మాణంలో ఉన్న టాయ్లెట్స్పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టెన్త్ స్టూడెంట్లను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీ, నిత్యావసర సరుకులు నిల్వ చేసే గదిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్ను సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఒకటి నుంచి పత్తి కొనుగోళ్లు..
జిల్లాలో నవంబర్ ఒకటి నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్టు కలెక్టర్ కుమార్ దీపక్తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, డీఏవో సురేఖ, మార్కెటింగ్ ఆఫీసర్ షహబుద్దీన్, సీపీవో సత్యంతో కలిసి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులతో బుధవారం కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
పత్తి విక్రయాలకు కపాస్ కిసాన్ యాప్లో రైతులు తమ వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పత్తి జిల్లాలోకి రాకుండా బోర్డర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.