
- రెండు గంటలు టైమ్ కేటాయించలేరా?
- అప్లికేషన్లు పెండింగ్లోఎందుకు ఉంటున్నయ్
- హాజరుకాని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వండి
- వచ్చే మీటింగ్కు సబార్డినేట్స్ను పంపొద్దు
- ప్రజావాణిలో అధికారులపై కలెక్టర్ అనుదీప్ ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ‘ప్రజావాణి టైమ్ లోనే మీకు పనులుంటాయా ? ఏమైనా పనులుంటే పొద్దున పెట్టుకోండి. లేదా సాయంత్రం
పెట్టుకోండి. ప్రజావాణి ఉండేదే రెండు గంటలు. అటెండ్ కాని అధికారులకు నోటీసులు ఇస్తాం.” అని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిపై రివ్యూ మీటింగ్ జరిగింది. వివిధ డిపార్టుమెంట్ల అధికారులు హాజరై తమ పరిధిలోని ప్రజావాణి అప్లికేషన్ల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని మండలాల తహశీల్దార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జిల్లా, మండల ఆఫీసుల్లో పదుల సంఖ్యలో ప్రజావాణి అప్లికేషన్లు పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జీతాలు తీసుకోవట్లేదా? సరిపోను స్టాఫ్ఉన్నారుగా? మరెందుకు అప్లికేషన్లు పెండింగ్లో ఉంటున్నాయి ? హోమ్వర్క్ చేయండి? స్కూల్ పిల్లలకు చెప్పినట్లు ప్రతి రోజూ చెప్పాల్నా..?’ అని ఆయన ప్రశ్నించారు. ‘పెండింగ్అప్లికేషన్లు 3 రోజుల్లో పూర్తి చేయాలి. లేదంటే సాలరీలు నిలిపివేస్తా’ .. అని కలెక్టర్ అధికారులపై సీరియస్ అయ్యారు.
సబార్డినేట్స్ రావొద్దు
తర్వాతి మీటింగ్కు అధికారులే రావాలని, సబార్డినేట్స్ను పంపొద్దని కలెక్టర్ స్పష్టంచేశారు. రివ్యూ మీటింగ్కు రాని వారికి షోకాజ్నోటీసులు ఇస్తామని, ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. రివ్యూ ఉందని తెలిసి కూడా పెండింగ్అప్లికేషన్స్పట్టుకొని కలెక్టరేట్కు రావడం సరికాదని, మళ్లీ రిపీట్కావొద్దని సూచించారు. జిల్లాలోని ఓ శాఖ ఆఫీసులో 70 ప్రజావాణి అప్లికేషన్లు పెండింగ్లో ఉండటంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆరుగురు సిబ్బంది ఉండి కూడా అన్ని అప్లికేషన్లు పెండింగ్లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అసలు ఆఫీసులకు వస్తున్నారా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్తహశీల్దార్ లో 23, మెజిస్ట్రేట్ఎంక్వైరీ11, సీడీపీ7, పెన్షన్లు తదితర డిపార్టుమెంట్లలో పెండింగ్అప్లికేషన్లు ఉన్నాయని, మూడు రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లాలో ప్రజావాణికి 98 అర్జీలు
ఎల్బీనగర్: కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 98 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో మొత్తం 30 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. హౌసింగ్కు చెందినవి 20 ఉండగా, ఇతర శాఖలవి15 ఉన్నాయని చెప్పారు. అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవోలు సూర్య ప్రకాశ్, రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.