
జనగామ అర్బన్, వెలుగు: విద్యా వ్యవస్థకు పటిష్టమైన చర్యలు చేపట్టామని, ఆమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేస్తామని, ప్రతి పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని జనగామ ఇన్చార్జి కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో విద్యా వ్యవస్థ పటిష్టత కొరకు తీసుకుంటున్న చర్యలను హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సమీక్షలో జనగామ కలెక్టర్ పాల్గొని జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలపై వివరించారు.
అనంతరం రాష్ర్ట చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ జిల్లాలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలపై వివరించారు. ఇదిలా ఉండగా, జిల్లాలో 280 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ప్రైవేట్ దుకాణాల్లో 200 టన్నులు ఉండగా, మరో 500 టన్నులు రేపటికి ఎన్ఎఫ్ఎల్ కంపెనీ నుంచి చేరుకోనున్నదని కలెక్టర్ తెలిపారు. రేపటి నుంచి రైతులకు యూరియా అందుబాటులో ఉంటుందని చెప్పారు.