దరఖాస్తులను పరిష్కరించాలి

దరఖాస్తులను పరిష్కరించాలి

భూపాలపల్లి రూరల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ ఆఫీస్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 70 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆఫీస్​లో నిర్వహించిన ప్రజా దివాస్​ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్​ఖరే ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.