మెదక్​ జిల్లాలో ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

మెదక్​  జిల్లాలో ఈవీఎంలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

మెదక్​, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజర్షి షా సోమవారం పరిశీలించారు.  గుర్తింపు పొందిన పొలిటికల్​పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను  పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును ప్రాథమిక పరిశీలన (ఎఫ్.ఎల్.సి) జరిపేందుకు ఈసీఐఎల్ కు చెందిన ఏడుగురు సాంకేతిక నిపుణుల బృందం జిల్లాకు చేరుకుంది.

ఈ బృందం దాదాపు పది రోజుల పాటు ఇక్కడే ఉండి ఈవీఎంల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. స్థానికంగా గల 1,197  బ్యాలెట్ యూనిట్లు, 947 కంట్రోల్ యూనిట్లు, 911 వీవీ ప్యాట్లను నిపుణుల బృందం పరిశీలిస్తుందని ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.  పొలిటికల్​ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో  అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  కలెక్టర్ వెంట అడిషనల్​ కలెక్టర్ రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, వివిధ పొలిటికల్​పార్టీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు 

ఉన్నారు.