పార్లమెంట్​ ఎలక్షన్​కు 9 వేల మంది సిబ్బంది : రాజీవ్ ​గాంధీ హన్మంతు

పార్లమెంట్​ ఎలక్షన్​కు 9 వేల మంది సిబ్బంది : రాజీవ్ ​గాంధీ హన్మంతు
  • సీఎంసీ కాలేజ్​ బిల్డింగ్​లో కౌంటింగ్
  • జూన్​6 దాకా కోడ్​ అమలు 

నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎలక్షన్స్​ ​కోసం జిల్లాలో 9 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారని కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హన్మంతు తెలిపారు. జూన్​6 వరకు ఎలక్షన్​ కోడ్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కలెక్టర్​ఆదివారం మీడియాతో వివరాలు వెల్లడించారు. డిచ్​పల్లి లోని సీఎంసీ మెడికల్​కాలేజీలో ఓట్ల కౌంటింగ్​ ఉంటుందన్నారు.

బాన్సువాడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ బాధ్యతను తానే పర్యవేక్షిస్తానన్నారు. 85 ఏండ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటు ఉందని, ఏప్రిల్​22లోపు అందుకు సంబంధించిన ఫారాన్ని బీఎల్​వోలకు అందజేయాలన్నారు. పోలింగ్​శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సీపీ కల్మేశ్వర్​మాట్లాడుతూ.. ఎన్నికల కోసం జిల్లాలో మొత్తం 18 చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొలిటికల్​ పార్టీ లీడర్లు నిర్వహించే మీటింగ్​లకు ముందస్తు పర్మిషన్లు తీసుకోవాలన్నారు. రాత్రి 10 గంటల నుంచి పొద్దున 6 దాకా లౌడ్​స్పీకర్లు వాడొద్దని సూచించారు.

ALSO READ | ఆర్మూర్ మున్సిపల్ ​పీఠంపై ఉత్కంఠ

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు, వాట్సాప్​పోస్టులు పెట్టొద్దన్నారు. ప్రార్థనా మందిరాలకు 100 మీటర్లలోపు ప్రచారాలు చేయరాదన్నారు. అడిషనల్​కలెక్టర్లు అంకిత్, కిరణ్​కుమార్, ట్రైనీ ఐపీఎస్​ చైతన్యరెడ్డి, అడిషనల్​డీసీపీ కోటేశ్వరరావు ఉన్నారు. అనంతరం కలెక్టరేట్​లోని 28 నెంబర్​రూమ్​లో మీడియా సెంటర్ ను ప్రారంభించారు.