నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ నిరోధానికి కలిసి నడుద్దాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లాలో డ్రగ్స్ నిరోధానికి కలిసి నడుద్దాం : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో డ్రగ్స్, మత్తుపదార్థాల నిరోధానికి ప్రజలతో కలిసి నడుద్దామని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.  శనివారం కలెక్టరేట్​లో నిర్వహించిన నషా ముక్త్​ అభియాన్ జిల్లా సమన్వయ కమిటీ మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలకు పెనుముప్పు వాటిల్లుతుందన్నారు.  అవగాహన కార్యక్రమాలు పెంచి ప్రజల్లో మార్పు తేవాలన్నారు.

 కల్తీ కల్లు వాడకంపై కూడా ప్రచారం చేయాలన్నారు. సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ మత్తుపదార్థాలు కనబడితే 14446 టోల్​ఫ్రీకి సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్​బీ, డీవీఈవో రవికుమార్​, ఎక్సైజ్​ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

స్పెషల్ రివిజన్​పై రోజువారి సమీక్ష

లోపాలు లేకుండా ఓటర్​ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్​ రివిజన్​ ప్రక్రియ చేపట్టామని కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు.  పురోగతిని ప్రతి రోజు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. శనివారం సీఈసీ అదనపు కమిషనర్​ లోకేశ్​కుమార్​ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​ జిల్లా వివరాలు తెలిపారు. ఇప్పటి వరకు 50 శాతం మ్యాపింగ్ చేశామన్నారు. అడిషనల్​ కలెక్టర్లు అంకిత్, కిరణ్​కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, హౌసింగ్​ పీడీ పవన్​కుమార్, ఎలక్షన్​ సూపరింటెండెంట్ ధన్వాల్​ తదితరులు పాల్గొన్నారు.