బస్సు, డీసీఎం ఢీకొని అక్కడిక్కడే ఐదుగురు మృతి

బస్సు, డీసీఎం ఢీకొని అక్కడిక్కడే ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, డీసీఎం ఢీ కొన్న ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ-రాంపూర్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది.  ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని సమీప హాస్పిటల్ కు తరలించారు. బస్సు పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ వెళ్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉండగా..అదే సమయంలో డీసీఎంలో సుమారు 24 మంది ఉన్నారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.