న్యూఢిల్లీ: దేశంలో లాక్డౌన్ను ఈనెల17 వరకూ పొడిగించడంతో అప్పటి వరకూ కమర్షియల్ పాసింజర్ విమాన సర్వీసులను కూడా నిలిపేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది. మే 17 అర్ధరాత్రి వరకూ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్టు శనివారం ఒక సర్క్యూలర్లో వెల్లడించింది.
డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా మార్చి 25 నుంచి కమర్షియల్ విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. కార్గో సర్వీసులు, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసులు, స్పెషల్ ఫ్లైట్లను మాత్రమే డీజీసీఏ అనుమతిస్తోంది.