ఏషియన్​ పెయింట్స్ రెవెన్యూ రూ. 8,452 కోట్లు

ఏషియన్​ పెయింట్స్ రెవెన్యూ రూ. 8,452 కోట్లు

న్యూఢిల్లీ: ​ కంపెనీ ఏషియన్​ పెయింట్స్​ లిమిటెడ్ ​ క్యూ 2  నికర లాభం 53.31 శాతం పెరిగి రూ. 1,232.39 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో రెవెన్యూ మాత్రం పెరగలేదు. అంతకు ముందు ఏడాది క్యూ2 తో పోలిస్తే తాజా క్వార్టర్లో గ్రాస్​ మార్జిన్లు 770 బేసిస్ పాయింట్లు మెరుగుపడినట్లు ఏషియన్​ పెయింట్స్​ వెల్లడించింది. రా మెటీరియల్స్​ ధరలు కొంత తగ్గడంతోపాటు, ఆపరేషనల్​ ఎఫిషియెన్సీ మెరుగవడం కలిసివచ్చిందని కంపెనీ ​ సీఈఓ అమిత్​ సింగ్లె చెప్పారు. 

డొమెస్టిక్​ డెకొరేటివ్​ పెయింట్​ బిజినెస్​ క్యూ2 లో గ్రోత్​ సాధించలేదని, వాల్యూమ్​  పరంగా 6 శాతం ఎదిగిందని కంపెనీ వెల్లడించింది. ఆటోమోటివ్​, రిఫినిష్​ బిజినెస్​లు మాత్రం రెండంకెల గ్రోత్​ సాధించినట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్​ బిజినెస్​ సెప్టెంబర్​ క్వార్టర్లో 3.9 శాతం తగ్గి రూ. 775 కోట్లకు పరిమితమైనట్లు వివరించింది.