
న్యూఢిల్లీ: కంపెనీ ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ క్యూ 2 నికర లాభం 53.31 శాతం పెరిగి రూ. 1,232.39 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో రెవెన్యూ మాత్రం పెరగలేదు. అంతకు ముందు ఏడాది క్యూ2 తో పోలిస్తే తాజా క్వార్టర్లో గ్రాస్ మార్జిన్లు 770 బేసిస్ పాయింట్లు మెరుగుపడినట్లు ఏషియన్ పెయింట్స్ వెల్లడించింది. రా మెటీరియల్స్ ధరలు కొంత తగ్గడంతోపాటు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ మెరుగవడం కలిసివచ్చిందని కంపెనీ సీఈఓ అమిత్ సింగ్లె చెప్పారు.
డొమెస్టిక్ డెకొరేటివ్ పెయింట్ బిజినెస్ క్యూ2 లో గ్రోత్ సాధించలేదని, వాల్యూమ్ పరంగా 6 శాతం ఎదిగిందని కంపెనీ వెల్లడించింది. ఆటోమోటివ్, రిఫినిష్ బిజినెస్లు మాత్రం రెండంకెల గ్రోత్ సాధించినట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్ బిజినెస్ సెప్టెంబర్ క్వార్టర్లో 3.9 శాతం తగ్గి రూ. 775 కోట్లకు పరిమితమైనట్లు వివరించింది.