
వర్ని,వెలుగు: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై శుక్రవారం ముస్లిం నాయకులు రుద్రూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.
కార్యక్రమంలో రుద్రూర్ జామామసీద్ సదర్ జహుర్, మజీద్ సదర్ మహ్మద్ ఇమ్రాన్ ఖాద్రి, అక్బర్నగర్ మజీద్ సదర్ షేక్ మహ్మద్, ఖిద్మత్ ఫౌండేషన్ అద్యక్షుడు సయ్యద్ ముల్తాని, ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు లాల్ మహ్మద్ పాల్గొన్నారు.