పినపాక, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీ స్కూల్లో మూడురోజులుగా నిర్వహించిన 69వ స్టేట్లెవల్అండర్-–17 బాల బాలికల కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారుల నడుమ పోటీలు ఉత్కంఠతో కొనసాగాయి. నల్లగొండ బాలికల జట్టుతో జరిగిన పోటీలో ఖమ్మం బాలికల జట్టు గెలుపొందింది.
ఫైనల్ పోటీలో ఖమ్మం బాలుర టీమ్ పై హైదరాబాద్ టీమ్విజయం సాధించింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్, కొత్తగూడెం డీఎఫ్ వో యు.కోటేశ్వరరావు విజేతలకు బహుమతులను అందించారు. స్కూల్హెచ్ఎం కొమరం నాగయ్య అధ్యక్షతన క్రీడా పోటీలు నిర్వహించారు.
వచ్చే జనవరిలో నేషనల్లెవల్అండర్–17బాలుర కబడ్డీ పోటీలను కూడా ఇదే గ్రౌండ్లో నిర్వహిస్తారు. కలెక్టర్జితేశ్వి పాటిల్పర్యవేక్షణలో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. కేజీబీవీ బాలికల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో సంకీర్త్, జిల్లా స్పోర్ట్స్ఆఫీసర్వాసిరెడ్డి నరేశ్పాల్గొన్నారు.
