భోపాల్: రాహుల్ గాంధీని ఎన్ని డిఫరెంట్ లుక్లతో పబ్లిక్లోకి తీసుకొ చ్చినా కాంగ్రెస్ సినిమా నడవలేక పోతోందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎద్దేవా చేశారు. శనివారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్పై నమోదైన పరువు నష్టం కేసుపై స్పందిస్తూ.. కాంగ్రెస్ శ్రేణుల సంబరాలకు అర్థమేలేదన్నారు.శిక్షపై సుప్రీం కోర్టు స్టే మాత్రమే విధించిందని గుర్తుచేశారు.
అది తుది తీర్పు కాదని చెప్పారు. రాహుల్ను కాంగ్రెస్ ఎన్నో సార్లు కొత్త లుక్లో ప్రజల ముందుకు తీసుకొచ్చిందని.. అయినా కూడా ఆయన సినిమాలు సక్సెస్ కాలేదన్నా రు. భవిష్యత్తులో కూడా రాహుల్ సినిమాలు నడుస్తాయనే నమ్మకం తనకు లేదని ఎద్దేవా చేశారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గడ్డం పెరిగిందే తప్ప కాంగ్రెస్కు ఒరిగిందే మి లేదని తోమర్ పేర్కొన్నారు.