పేదల కోసం పనిచేస్తా : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

పేదల కోసం పనిచేస్తా : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి
  •    కాంగ్రెస్‌‌ భువనగిరి అభ్యర్థి కుంభం

యాదాద్రి, వెలుగు : తనను గెలిపిస్తే పేద ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని కాంగ్రెస్​భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నియోజకవర్గంలోని భువనగిరి మున్సిపాలిటీ, బీబీనగర్​ మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కలిగే లబ్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  తొమ్మిదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

ఇప్పటివరకూ కొత్త రేషన్​ కార్డులు ఇవ్వలేదని, ఏండ్లు గడుస్తున్నా వితంతు పింఛన్లు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. అనంతరం చీమలకొండూరు సర్పంచ్ జీలుగు కవిత, ఉప సర్పంచ్ పల్లెర్ల నర్సింహా, బీబీనగర్​ మాజీ ఎంపీటీసీ బింగి శ్రీనివాస్ సహా వందల సంఖ్యలో బీఆర్​ఎస్​ కార్యకర్తలు కాంగ్రెస్​లోచేరారు.